ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు : సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 16, 2018, 11:39 AM

రోజుకో మాట మాట్లాడే పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఒక వైపు అహింసావాదిని అంటారు..మరోసారి దెబ్బకు దెబ్బ తీయాలని అంటారన్నారు. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అయితే.. యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజారాజ్యం తర్వాత పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారన్నారు. సీఎం పదవిపై ఆశ లేదని ఒకసారి చెబుతారు… మరోసారి సీఎం కావాలంటారన్నారు. తిత్లీ తుపానుతో ప్రజలు అల్లాడుతుంటే కవాతు చేస్తున్నారన్నారు. కవాతుకు కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని ఎక్కన్నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.. ఛాయ్ వాలాగా ఉన్న మోడీ ప్రధానమంత్రి అయ్యారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com