పలాస వద్ద తితిలీ తుఫాను కారణంగా దెబ్బతిన్న జీడిపప్పు యూనిట్లను పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి పరిశీలించారు. రోజూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమలకు తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్దరణకు పనులు ప్రారంభించాలని మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కింద జీడిపప్పు పరిశ్రమకు సబ్సిడీలు ఇవ్వాలని పరిశ్రమల యాజమాన్యాలు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.