గోవాలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడి బిజెపిలో చేరనున్నారు. సోమవారం అర్ధరాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దయానంద్ సోప్టే, సుభాష్ శిరోద్కర్లు హుటాహుటిన ఢిల్లికి బయలుదేరి వెళ్లారు. వారిద్దరూ నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో సమావేశమై, బిజెపిలో చేరుతారని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు.