న్యూఢిల్లి : భారతదేశ ఇంధన అవసరాలను, మరీ ముఖ్యంగా చమురు అవసరాలను తీర్చడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ఖాలిద్ ఎ అల్ ఫలీహ్ చెప్పారు. భారత్లో పెట్టుబడులను మరింతగా పెంచుతామని ఆయన అన్నారు. రత్నగిరి రిఫైనరీలో 44 బిలియన్ డాలర్ల పెట్టుబడి కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన చెప్పారు.