ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ కార్యాలయం శంకుస్థాపనలో ముహూర్తం గొడవ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 16, 2018, 10:36 AM

అమరావతి: బీజేపీ ఏపీ శాఖ పార్టీ కార్యాలయం శంకుస్థాపనలో ముహూర్తం గొడవ తలెత్తింది. మంగళగిరి సమీపంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం తలపెట్టారు. గుంటూరు నుంచి రిమోట్ ద్వారా ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా అష్టమి రోజున రాహుకాలంలో భూమి పూజపై పార్టీ నేతల మండిపడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన భూమిపూజ కార్యక్రమంపై తాజాగా సైతం అంసతృప్తి నెలకొంది. ముహూర్తంపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ పార్టీ పెద్దలపై స్థానిక నేతలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ పెద్దలు స్పందిస్తూ.. నవరాత్రి సమయంలో అన్నీ మంచి రోజులే అని.. ముహూర్తం విషయంలో ఎటువంటి వివాదం లేదని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com