ధవళేశ్వరం : విజయవాడ నుంచి రోడ్డు మార్గాన విజ్జేశ్వరం చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ మరి కొద్ది సేపటిలో ధవళేశ్వరం బ్యారేజిపై జరిగే కవాతులో పాల్గొంటారు. అంతకంటే ముందు ఆయన విజ్జేశ్వరంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. కవాతు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, పోలీసుల అభ్యంతరం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఆయన వారితో చర్చిస్తున్నారు. జనసేన నాయకులు బ్యారేజీపై పరిస్థితిని పరిశీలిస్తున్నారు.