ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కవాతును నిరాకరిస్తూ పోలీసుల నోటీసుల జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 15, 2018, 02:12 PM

రాజమండ్రి:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ నిర్వహిస్తున్న కవాతును పోలీసులు నిరాకరించారు. కవాతుకు అనుమతి ఇవ్వలేమంటూ నోటీసులు జారీచేశారు. కవాతుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని బ్యారేజీ పిట్టగోడలు ఎత్తులేకపోగా, బలహీనంగా కూడా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇక సభను కూడా ఇప్పటికే పార్టీ ఏర్పాటు చేసుకున్న చోట కాకుండా మరోచోటుకు మార్చుకోవాలని కోరారు. ఏర్పాటు చేసిన చోట పదివేలమందికి పైగా జనాభా ఉండలేరని ప్రాంగణం సరిపోని కారణంగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని పోలీసులు నోటీసులు జారీచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com