రాజమండ్రి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ నిర్వహిస్తున్న కవాతును పోలీసులు నిరాకరించారు. కవాతుకు అనుమతి ఇవ్వలేమంటూ నోటీసులు జారీచేశారు. కవాతుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని బ్యారేజీ పిట్టగోడలు ఎత్తులేకపోగా, బలహీనంగా కూడా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇక సభను కూడా ఇప్పటికే పార్టీ ఏర్పాటు చేసుకున్న చోట కాకుండా మరోచోటుకు మార్చుకోవాలని కోరారు. ఏర్పాటు చేసిన చోట పదివేలమందికి పైగా జనాభా ఉండలేరని ప్రాంగణం సరిపోని కారణంగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని పోలీసులు నోటీసులు జారీచేశారు.