చిత్తూరు: ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు బీజేపీ పనేనన్న మంత్రి అమర్నాధ్ రెడ్డి కేవలం టీడీపీ నేతల మీదనే సోదాలు జరగడం కక్ష్య సాధింపేనన్నారు. గతంలో తమిళనాడు, కర్ణాటకలో కూడా ఇలానే సంస్థల ద్వారా బెదిరించి బీజేపీ తమదారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. చిత్తూరులో అమర్ రాజా బ్యాటరీస్ మూడవ ప్లాంటుకు శంకుస్థాపన చేరిన మంత్రి మాట్లాడుతూ ఐటీ సోదాలు తామేమీ భయపడంలేదని, భయబ్రాంతులకు గురించేసేలా ప్రవర్తిస్తున్నారన్నారు.