కర్ణాటకలో హోసపేట్లోని చితవాదగి ప్రాంతంలో ఒక ఇంటి బాల్కనీ కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించగా 58 మంది గాయపడ్డారు. బాధితులు మొహర్రం ఊరేగింపును చూస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వ్యక్తిని 16 సంవత్సరాల ఉషగా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ కమిషనర్ రాంప్రసాద్ మనోహర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ్ రంగరాజన్ సంఘటనా స్థలికి చేరి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.