ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్కనీ కూలి ఒకరి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 21, 2018, 02:45 PM

కర్ణాటకలో హోసపేట్‌లోని చితవాదగి ప్రాంతంలో ఒక ఇంటి బాల్కనీ కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించగా 58 మంది గాయపడ్డారు. బాధితులు మొహర్రం ఊరేగింపును చూస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వ్యక్తిని 16 సంవత్సరాల ఉషగా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ కమిషనర్‌ రాంప్రసాద్‌ మనోహర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అరుణ్‌ రంగరాజన్‌ సంఘటనా స్థలికి చేరి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com