విజయవాడ : జియో ట్యాగింగ్ ద్వారా భూములను డిజిటలైజ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న జ్ఞానభేరి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. చంద్రబాబు మాట్లాడుతూ జియో ట్యాగింగ్ చేస్తే రికార్డులను ట్యాంపరింగ్ చేయలేరన్నారు. సులభతర పరిపాలన, జవాబుదారీతనంతో పరిపాలన చేస్తున్నామన్నారు.