విజయవాడ : సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని దూసుకుపోవాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న జ్ఞానభేరి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ హేతుబద్దత లేని విభజన జరిగిందన్నారు. భారతదేశంలోనే ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు.