విజయవాడ : సీఎం ఆలోచనలకు ప్రతిరూపంగా జ్ఞనభేరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ జ్ఞానభేరి కార్యక్రమం ప్రత్యేకత యువత తో నిర్వహించడమన్నారు. 13 అంశాల్లో పోటీలు నిర్వహించి 39 మందిని ఎంపిక చేసి మొదటి బహుమతిగా లక్షరూపాయలు, రెండవ బహుమతిగా రూ.50 వేలు, 3వ బహుమతి గా రూ.25 వేలు అందిస్తామన్నారు. విద్య కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిబడ్జెట్లో రూ.22 వేల కోట్ల ను కేటాయించడం జరిగిందన్నారు. లక్ష్య సాధన కోసం నిరంతరం దృష్టి సారించి విజయం సాధించలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. అందుకే సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను ముఖ్యమంత్రి పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారని తెలిపారు.