ఆంధ్రప్రద్శ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న జ్ఞానభేరి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. చంద్రబాబు మాట్లాడుతూ… ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్ నుంచి ఉన్నారన్నారు. పిల్లలను బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుందన్నారు. ప్రపంచంలో ఏదేశానికి లేని శక్తి భారత్ కు ఉందన్నారు. చదువు సంస్కారంతో ప్రపంచాన్ని జయించవచ్చునని అన్నారు. చదువు, సంస్కారం ఉంటే ఆ శక్తి యువతకు వస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు సంస్కారం నేర్పిస్తే చాలునని అన్నారు. గతంలో ఆస్తుల కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడేవాళ్లమని ఆయన చెప్పారు. ఇప్పుడు చదువు సంస్కారం ఇస్తే చాలునని ఆయన అన్నారు.