కడప : రిమ్స్ కాంట్రాక్టు వైద్యులను రెగ్యూలరైజ్ చేయాలన్న గెజిట్ కు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి రిమ్స్ వైద్యులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ గెజిట్ వల్ల దాదాపు 9 వేల మంది వైద్యుల సీనియారిటీ పై ప్రభావం పడుతుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు సర్వేశ్వర్ రెడ్డి, వెంకట శివ తెలిపారు. ప్రభుత్వం ఈ గెజిట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 25 నుంచి సమ్మెబాట పడతామని హెచ్చరించారు.