న్యూఢిల్లి : జమ్ము కాశ్మీర్ తాత్కాలిక డిజిపిగా దిల్బాగ్ సింగ్ కొనసాగుతారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. డిజిపి నియామకంపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) ఒక నిర్ణయం తీసుకునే వరకూ దిల్బాగ్ సింగ్ డిజిపిగా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కాశ్మీర్ డిజిపి ఎస్పి వేద్ను ఆ పదవినుంచి తప్పించి దిల్బాగ్ సింగ్ను నియమించారు. కాగా వేద్ తరువాత సీనియర్ అధికారిని కాకుండా జూనియర్ అధికారిని నియమించడంపై ప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది. జమ్ము కాశ్మీర్ డిజిపిగా నియమించడానికి అర్హతలున్న సీనియర్ అధికారులను విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని యుపిఎస్సికి సుప్రీంకోర్టు సూచించింది.