కడప: తమ పార్టీలో పందెంకోళ్లు ఉంటే ఇతర పార్టీలలో దిబ్బల మీద తిరిగే కోళ్లు ఉన్నాయని సంచలన కామెంట్స్ ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి చేసారు. కర్నూలులో జరిగిన రాహుల్ గాంధీ సభ దేశంలోనే రాజకీయాలకు సూచికగా మారిందన్న ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై మొదటి సంతకం మరియు వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న తులసి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక గంగానది లాంటిది ఏపార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చనున్నారు.