ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 02:51 PM

 ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అల్లుడు సుద్దులు అనే పుస్తకం రాశానని, త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ప్రకటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టో అంతా మోసపూరిత హామీలేని లక్ష్మీపార్వతి విమర్శించారు. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏమంటారని ప్రశ్నించారు. చంద్రబాబు హామీల అమలుకు ఆర్బీఐ సొమ్ము కూడా చాలదని లక్ష్మీపార్వతి అన్నారు.  లోకేష్‌ది పాదయాత్ర కాదు..ఈవినింగ్‌ వాక్‌ అని ఎద్దేవా చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com