ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 05, 2023, 09:20 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. వేద పండితుల సూచనల మేరకు ఈ యజ్ఞం నిర్వహించారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించగా ఇందులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే.


మహా యజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో వేద పండితులు శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com