ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 05, 2023, 09:19 PM

గుంటూరు జిల్లాలో ఘోర  ప్రమాదం చోటు  చేసుకొన్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలవడం తీవ్ర ఆవేదన కలిగించిందని వెల్లడించారు. శుభకార్యానికి వెళుతున్న బృందం ప్రమాదం బారినపడడం బాధాకరమని వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com