జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. గ్రామంలో 60 మంది విద్యార్థులకు పాఠశాల లేదని, విద్యార్థులు 6 కిలోమీటర్ల మేర కొండలు దాటి పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని వాపోయారు. విద్యార్థుల వెతలపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి తాత్కాలిక పాఠశాలను ఏర్పాటు చేసింది.