ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 07:34 PM

భౌతికదాడులకు సిద్దమని వైసీపీ చెబితే.. తాము కూడా సిద్దమేనని స్పష్టం బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ స్పష్టంచేశారు. తమపై దాడి జరుగుతోంటే పోలీసులు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. తప్పులు చేసే అధికారులపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  'అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి మందడం వెళ్లాం. జగన్  ఏ విధంగా రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారో వివరించాం. సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో మమ్మల్ని పోలీసులు ఆపారు. పోలీసులు ఆపడంతోనే మాపై దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. మా వాహానం పైనా.. మాపైనా దాడి మీద చేస్తుంటే.. పోలీసులు మమ్మల్ని రోప్ పెట్టి అడ్డుకున్నారు. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని ఎంపీ సురేష్ అన్నారంటే ఏంటీ అర్థం? ఆదినారాయణ రెడ్డి మీద బాబాయ్ గొడ్డలి వేటు పడేదా..?' అని సత్యకుమార్  ప్రశ్నించారు.


'తాడేపల్లి ప్యాలెస్ నుంచే పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీని పై కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఉంది. నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. నేను డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన స్పందించడం లేదు. అంత మంది పోలీసులు ఎందుకున్నారు..?' అని సత్యకుమార్ నిలదీశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com