ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనపై బురదజల్లే రాజకీయం చేస్తున్నారు.... వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 12:04 AM

తనపై బురదజల్లే రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల ప్రియ మాటలు.. చంద్రబాబు మార్క్ ట్రిక్స్ అని ఆరోపించారు. నా బాస్ జగన్.. ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆడపిల్లపై కాలు దువ్వే స్థాయికి దిగజారలేదని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే గురువారం అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని తనకు తెలిసిందన్నారు. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.


అఖిలప్రియ చేసిన పార్టీ మార్పు కామెంట్స్‌పై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మారడం ఏంటని ప్రశ్నించారు. తాను ఎప్పటికీ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరడం అంటే.. జగన్‌ను లోకేష్ ఎమ్మెల్సీ పదవి అడిగినట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. కోటంరెడ్డిని చూపి.. 


అటు అవినీతిపైనా ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈనెల 4న ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తాను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకొస్తానని అఖిల ప్రియ చెప్పారు. తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ ఎమ్మెల్యే శిల్పా రవి చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. లేక పోతే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com