ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిలమత్తూరు మండలంలో వ్యక్తి దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 07:26 PM

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం సోమగట్టలో బుధవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వేరాల మేరకు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వడ్డే నాగరాజు (34) ను కిరాతకంగా వేట కడవలతో నరికి చంపారు. ఉదయం నాగరాజు పొలం వద్దకు వెళ్లి మట్టి గుంత తవ్వే పనులు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆ గుంతలోనే హతమార్చారు. ఈ విషయం తెలుసుకున్న చిలమత్తూరు ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com