శిశువులు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధవహించాలని ఎట్టి పరిస్థి తులలోను శిశు మరణాలు జరగ కూడ దని, బాల్య వివా హాలు జరగకుండా ప్రత్యేకశ్రద్ధవహించాలని, యువతకు స్కిల్ డెవెలప్ మెంట్ ద్వార యువతకు శిక్షణ , ఉపాధి అవకాశాలు కల్పించాలని సి. ఎస్. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుండి స్కిల్ డెవల ప్మెంట్, గ్రామీణ అభి వృద్ధి, వైద్యఆరోగ్యశాఖ, ఐసిడిఎస్, స్పందన, గడపగడపకు మన ప్రభుత్వం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన వివిధ శాఖల కార్యదర్శుల తో కలసి అన్ని జిల్లా ల కలెక్టర్లతో సమీక్షనిర్వహించారు.