ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో నేటి వాతావరణ సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 10:49 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం బుధవారం సాయంత్రానికి మాండూస్ తుపానుగా బలపడి గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలపై ఉండనుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీనుంచి అతిభారీ వర్షాలు పడతాయని, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు ఈ నెల 10వ తేదీ వరకు చేపలవేటకు వెళ్లవద్దని తెలిపింది.

విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.13 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.19 గంటలకు కానుంది.

ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.29 గంటలకు కానుంది.

ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.38 గంటలకు కానుంది.

కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.31 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.45 గంటలకు కానుంది.

కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.25 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.44 గంటలకు కానుంది.

గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 గ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.35 గంటలకు నమోదు కానుంది.

కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.21 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.34 గంటలకు కానుంది.

విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.13 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.21 గంటలకు కానుంది.

చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.21 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.43 గంటలకు కానుంది.

అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.28 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.48 గంటలకు కానుంది.

నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.39 గంటలకు కానుంది.

శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.09 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.17 గంటలకు కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com