ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోల్తా కొట్టిన టాటా ఏస్ వాహనం...నలుగురు అయ్యప్ప స్వాముల దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 11:50 PM

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం వేమూరు మండలం జంపని వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. మృతులను కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రమేశ్ (55), బోదిన రమేశ్ (42), బుద్దన పవన్ కుమార్ (25) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com