ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 11:46 PM

కాయకస్టంచేసి పండించిన పంట కళ్లేదుటే పోతే  అన్నధాత మనోవేదన అంతా ఇంతా కాదు. ఇపుడు ఏపీ రైతులకు అదే బేగం పట్టుకొంది. ఇదిలావుంటే ఈ నెల 5న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాతి రోజున అది పుదుచ్చేరి, తమిళనాడు తీరం దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో 8, 9వ తేదీల్లో వర్షాలు పడతాయని తెలిపింది. వాతావరణశాఖ ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది. 


ప్రస్తుతం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు జోరుగా వరికోతలు సాగుతున్న నేపథ్యంలో వర్షం కనుక పడితే పంట వర్షార్పణం అయిపోతుంది. దీంతో వర్ష సమాచారం కోసం రైతులు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రానికి ఫోన్లు చేసి వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. 5న అల్పపీడనం ఏర్పడిన తర్వాత కానీ వర్షాలకు సంబంధించిన సమాచారంపై స్పష్టత రాదని పేర్కొన్నారు.  


తూర్పు గాలుల ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, మూడు నెలల కాలానికి గాను భారత వాతావరణ శాఖ నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రంగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com