జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కులాల పరిస్థితి, ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా పవన్ మాట్లాడారు. తూర్పు కాపుల విషయానికొస్తే.. ఒక్క మంత్రి, ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు ఇబ్బంది పడుతున్నామని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం రిజర్వేషన్ హోదాను తొలగించారుంటే ఓ అర్థం ఉంది కానీ ఇక్కడ ఏపీలో కేవలం మూడు జిల్లాలకు మాత్రమే హోదా కల్పించారని, మిగిలిన 10 జిల్లాల్లో తూర్పు కాపులకు గుర్తింపు లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.