ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ముసాయిదా ఓటరు జాబితా విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 10:51 AM

శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ జిల్లా స్థాయి ముసాయిదా ఓటర్ల జాబితా గురువారం విడుదలైంది. పట్టభద్రులకు సంబంధించి జిల్లాలోని 86 పోలింగ్ కేంద్రాల్లో 70, 272 మంది ఓటర్లున్నారు. వీరిలో 45, 626 మంది పురుషులు కాగా 24, 641 మంది మహిళా ఓటర్లుండగా మరో ఐదుగురు ఇతరులున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి 38 పోలింగ్ కేంద్రాల్లో 6, 251 మంది ఓటర్లున్నారు. అందులో 3, 638 మంది పురుషులు, 2, 612 మంది మహిళలు, ఇతరులు ఒక రున్నారు. అర్హత ఉండి ఓటు నమోదు కాని వారు డిసెంబరు 9వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com