చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయ ఇన్చార్జి ఈవోగా ఉన్న సురేష్బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో పాటు ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. సురేశ్బాబు స్థానంలో దేవస్థానం ఈఓగా రాణాప్రతాప్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.రెండు రోజుల క్రితం కాణిపాకం ఆలయంలో అభిషేకం టిక్కెట్ ధరను రూ.700 నుంచి రూ.5 వేలకు పెంచుతూ సురేష్ బాబు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టికెట్ ధర పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సురేష్ బాబు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ రుణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.