కేసీఆర్ కాదు కదా... కేసీఆర్ తాత వచ్చినా వైసీపీకి జరిగే నష్టమేమీ లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కూడా గుర్తు చేసిన కారుమూరి... వ్యతిరేక ఓటును చీల్చకుండా చూడాలని పవన్ సహా పలువురు నేతలు భావిస్తున్నారని... అయితే తమకు ఉన్నదంతా కలిసివచ్చే ఓటేనని, తమకు వ్యతిరేక ఓటు అన్నదే లేదని తెలిపారు. అందరూ కలిసి వచ్చినా సింహం సింగిల్ గా వచ్చినట్లుగా జగన్ సింగిల్గానే వస్తారన్నారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా అత్యధిక మెజారిటీతో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన వైనంపై ఏపీలోని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా స్పందిస్తున్నారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పై విధంగా స్పందించారు.