ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 11:15 PM

 'వస్తున్నా మీకోసం' యాత్రకు పదేళ్లు పూర్తయింది. టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పేరుతో పాదయాత్ర  చేపట్టిన విషయం తెలిసిందే. సరిగ్గా పదేళ్ల క్రితం అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు యాత్ర ప్రారంభించారు. 208 రోజుల పాటు యాత్ర సాగింది. 63 ఏళ్ల వయసులో చంద్రబాబు మెుత్తం 2,817 కిలోమీటర్లు నడిచారు. 1253 గ్రామాలు, 162 మండలాలను కలుపుకొని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలను చంద్రబాబు కలుసుకున్నారు.


చంద్రబాబు పాదయాత్ర 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద ముగిసింది. పాదయాత్ర ముగింపు రోజున అనంతపురానికి చెందిన టీడీపీ నేత వసంతనాయుడు ఈ యాత్రకు గుర్తుగా 2 కిలోల వెండితో చేసిన చెప్పులను చంద్రబాబుకు బహూకరించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర రాష్ట్రంలో సుధీర్ఘ రాజకీయ పాదయాత్రగా చరిత్రలో నిలిచిపోయింది. 2003లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. రంగారెడ్డి చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంచిన రాజశేఖర్ రెడ్డి... మెుత్తం 1500 కిలోమీటర్లు నడిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com