ఎల్లో మీడియా చేసేది జర్నలిజమేనా అంటూ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి సీఐడీ పోలీసులు వెళితే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఒక స్త్రీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని ఈ మీడియా ఎలా సమర్థిస్తుంది? అని ప్రశ్నించారు.
చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అని, ఐటీడీపీలో అతడి పోస్టులు దారుణంగా ఉంటాయని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన పనులకు చంద్రబాబు, లోకేశ్ వంతపాడుతున్నారని ఆరోపించారు. చింతకాయల విజయ్ పై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.
![]() |
![]() |