ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 03:26 PM

ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేడు జగన్ రెడ్డి పాలనలో గంజాయిప్రదేశ్‌గా మారిందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వి. ప్రణవ్ గోపాల్ విమర్శించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ. దేశంలో పట్టుబడ్డ గంజాయిలో సగం ఏపీ, ఒడిషా రాష్ట్రా ల్లోనే పట్టుబడిందని. దీనికి ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు. జగన్ రెడ్డి , వైసీపీ నేతలు తన అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాలను పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రం నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా కావడం దురదృష్టకరమన్నారు. జగన్ మూడేళ్ల ఏళ్ల పాటు సంపాదించింది చాలు - ఇకనైనా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాని అరికట్టి యువత భవిత కాపాడాలని ఎం. వి. ప్రణవ్ గోపాల్ హితవుపలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com