ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడి బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ నిన్న బాలిక మృతి చెందగా.. ఇవాళ తల్లి ప్రాణాలు విడిచింది. పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు.. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి ఆమెను బెదిరించాడు. పరువుపోతుందని భయపడి తల్లీకుమార్తె ఆత్మహత్యకు యత్నించారు.