దసరా ఏర్పాట్లపై శనివారం నగర పోలీస్ కమీషనర్ కాంతి రానా టాటా మీడియాతో మాట్లాడారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఐదు వేల పోలీస్ అధికారులు విధులను నిర్వర్తిస్తారన్నారు. 12 వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ను నియంత్రిస్తామని చెప్పారు. నిరంతర పర్యవేక్షణకు 400 సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ చెప్పారు.