న్యూఢిల్లి : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సమాయత్తమవుతోంది. కర్ణాటక ప్రజలు తమ పార్టీని సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు ఇటీవల తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ఆప్ ప్రధాన కార్యదర్శి పంకజ్ గుప్తా చెప్పారు. అయితే ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే అంశంపై ఆప్ ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు.