ఉత్తరప్రదేశ్: లక్నోలోని చిన్హత్లో కొందరు గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. ఏడుగురు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులపై కాల్పులు జరిపారు. ఇంట్లో నుంచి ఇద్దరు మైనర్ బాలికలను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.