గుత్తి: గుత్తి పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ. 12 లక్షల విలువ చేసే 24 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో గురువారం దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ మహబూబ్బాషా, సీఐ ప్రభాకర్గౌడ్లు తెలిపారు. గత యేడాది కాలంగా అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో తరుచూ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో అనంతపురం ఎస్పీ అశోక్ కుమార్ అఫెండర్స్ సర్వ్లైన్స్ సిస్టమ్ (పాత నేరస్తుల నిఘా కార్యక్రమం) ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా గతంలో బైక్ చోరీలు ఎక్కడెక్కడ జరిగాయి? వాటి అఫెండర్స్ ఎవరు? అనే విషయాలను ఆరా తీశారు. ఈ క్రమంలో గుత్తిలో గత మూడు మాసాల్లో 8 బైక్లు చోరీకి గురయ్యాయి.