విజయవాడలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు మున్సిపల్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై సీఎం ఆగ్రహించారు. కేంద్రం రూ.వెయ్యి కోట్లు ఇచ్చి రెండేళ్లయినా ఎందుకు పనులు చేపట్టలేదని సీఎం ప్రశ్నించారు. నిధుల వినియోగ ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. అవసరమైతే కాంట్రాక్టర్ ను తొలగించాలని సీఎం ఆదేశించారు.