పాల ట్యాంకర్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన ఘటన నెల్లూరు జిల్లాలోని పెళ్ళకూరు మండలం కొత్తూరు గ్రామం వద్ద చోటుచేసుకుంది. పాల ట్యాంకర్ ను మరో లారీ ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. రోడ్డుపై వస్తున్న పాల ట్యాంకర్ ను ఎదురుగా వస్తున్న మరో సిలికా లారీ ఢీకొంది. దీంతో లారీ డ్రైవర్ బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.