పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం నిర్మాణ ప్రాంతానికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేరుకున్నారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పనితీరును పరిశీలించిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, ఆర్టీజీఎస్ అధికారులతో చర్చించారు. ఆర్టీజీఎస్ చూస్తుంటే భారత్ లో ఉన్నట్లుగా అనిపించట్లేదన్నారు. అన్ని రాష్ట్రాలు ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సిఫారసు చేస్తామన్నారు. అనంతరం పోలవరం వద్దకు చేరుకున్నారు.