విజయవాడ: ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు అన్నారు. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విద్యాసాగర్రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ముఖ్యమంత్రి, మంత్రులు బాగా పని చేస్తున్నారని పొగిడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.