అమరావతి : ప్రణాళికా సంఘంతో నీతి ఆయోగ్ కు ఎలాంటి పోలికా లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయకన రాష్ట్రాల అభివృద్ధి కోసమే నీతి ఆయోగ్ పని చేస్తున్నదని అన్నారు. సీఎం నివాసం నుంచి కృష్ణానదిని వీక్షించాననీ, అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. మళ్లీ బెజవాడ వస్తానన్నారు. నీతి ఆయోగ్ ప్రథాన లక్ష్యం, ధ్యేయం టీమ్ ఇండియాగా పని చేయాలన్నదేనని రాజీవ్ కుమార్ చెప్పారు.