అమరావతి: సీఎం నివాసం వద్ద ఉన్న గ్రీవెన్స్ సెల్ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త పథకాలను సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించనున్నారు. సదస్సుకు ప్రత్యేకంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ హాజరవుతున్నారు.