రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఈ రోజాయన 16 ఐటీ కంపెనీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఈ మూడేళ్లలో రాజధాని నిర్మాణంలో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీల్లో కీలక స్థానాలలో ఉన్నది తెలుగువారేనని ఆయన అన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి కల్పించాలన్న దీక్ష, పట్టుదలతో ఏపీ సర్కార్ పని చేస్తున్నదని లోకేష్ చెప్పారు.