మంగళగిరి: డేటా సెంటర్ హబ్గా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ సంస్థలు, టెక్ టవర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. మంగళగిరి ఐటీ హబ్లో ఒకేసారి 16 కంపెనీలు ప్రారంభించుకున్నామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురం ఐటీ హబ్లుగా మారబోతున్నాయని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల్లో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు.