చిత్తూరు జిల్లాను కరవు రహిత జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నారావారిపల్లెలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం పుదిపుట్ల బైలు-రంగంపేట రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్కు అప్పగిస్తున్నామన్నారు. మదనపల్లెను టమోటా హబ్గా తయారు చేస్తామని, జిల్లాలో విలేజ్ టూరిజం, అగ్రికల్చరల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.