అమరావతి: కోస్తా వ్యాప్తంగా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. కోడిపందేలపై పోలీసులు ఆంక్షలను సడలించారు. దీంతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. లక్షల రూపాలయల్లో పందేలు జరుగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ఈ ప్రాంతాలకు చేరుకుని లాడ్జీల్లో ఉంటున్నారు. కాగా... కోడిపందేల మాటున గుండాట, కోతముక్క, లోపల బయట ఆటలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి కోడిపందేలపై పోలీసులు ఆంక్షలు సడలించడంతో పందెం రాయుళ్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.