చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 62వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఉదయం నెన్నూరు నుంచి ప్రారంభమైన జగన్ 62వ రోజు పాదయాత్ర శెట్టివారిపల్లి క్రాస్, కట్టకింద వెంకటాపురం, వెంకటాపురం క్రాస్, చల్లావారిపల్లి, సొరకాయలపాలెం క్రాస్, మద్దూరుపల్లి, పులికుంటల మీదుగా కమ్మపల్లి క్రాస్కు చేరుకుంది. కమ్మపల్లి క్రాస్లో జగన్కు ఘన స్వాగతం లభించింది. పాదయాత్ర వద్దకు భారీగా అభిమానులు, గ్రామస్థులు తరలివచ్చి జగన్కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో జగన్కు గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. జగన్ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు నడుస్తున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ మహా నేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.